Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సర్వం సిద్ధం..2 వేల డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం

ప్రయాగ్రాజ్ కుంభమేళాకు సర్వం సిద్ధం..2 వేల డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం

Kumbh Mela 2025 News | ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ ( Prayagraj ) కుంభమేళాకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.

12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను ప్రపంచస్థాయి ఉత్సవంలా నిర్వహించాలని యోగి సర్కార్ భావిస్తుంది. ఈ క్రమంలో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే కుంభమేళా ఆరంభ, ముగింపు దినాల్లో డ్రోన్ల ( Drones ) ద్వారా ప్రదర్శన ఉండనుంది.

ఆకాశంలో ఎగిరే డ్రోన్లు మహా కుంభ్, ప్రయాగ మహత్యం కథలతో భక్తులను కనువిందు చేయనున్నాయి. సాగర మథనం, అమృత కలశ అవిర్భావాలను కళ్ళకు కడతాయని అధికారులు పేర్కొన్నారు. మహా కుంభమేళాను ఐక్యతా మేళాగా ప్రధాని మోదీ ( Pm Modi ) అభివర్ణించారు.

భక్తుల భద్రత కోసం 50 వేల మంది సిబ్బంది, 2700 ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే తొలిసారి అండర్ వాటర్ ( Under Water ) డ్రోన్లను వినియోగించనున్నారు. అంతేకాకుండా కుంభమేళా సమాచారం తెలుసుకునేందుకు 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి అధికారులు తీసుకురానున్నారు.

ఈ ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 కోట్లమంది హాజరువుతారని అంచనా ఉంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions