Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > పరువునష్టం నోటీసులపై స్పందించిన కేటీఆర్!|

పరువునష్టం నోటీసులపై స్పందించిన కేటీఆర్!|

ktr pressmeet

Ktr Responce On Defamation Notice| పీసీసీ ( PCC ) పదవికి రూ. 50 కోట్లు ( Rs. 50 Cr. ) అనే వ్యాఖ్యలు చేసినందుకు గానూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ( Working President ) కేటీఆర్ ( Ktr ) కు తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ ( Incharge ) మాణికం ఠాకూర్ ( Manickam Tagore ) పరువు నష్టం నోటీసులు పంపారు.

ఈ నేపథ్యంలో తనకు వచ్చిన నోటీసుల ( Notice )పై స్పందించారు కేటీఆర్. ఎక్స్ ( Formerly Twitter ) వేదికగా స్పందించిన కేటీఆర్ మాణిక్కం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

“మాణికం ఠాకూర్ గారూ.. మీ తోటి కాంగ్రెస్ ( Congress ) నాయకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkatreddy ) బహిరంగంగానే రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మీకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి పదవి కొనుక్కున్నారని ఆరోపించారు. పెద్ద ఎత్తున మీడియా ( Media )లో వచ్చిన ఈ రూ. 50 కోట్ల లంచం ( Bribe ) వార్తలనే నేనూ ప్రస్తావించాను.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ పై చేసిన ఆరోపణలను ఇప్పటిదాకా వెనక్కి తీసుకోలేదు. కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. మీరు పంపే పరువు నష్టం నోటీసులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుంది. నా చిరునామా ( Address ) కు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించండి” అని పేర్కొన్నారు కేటీఆర్.

You may also like
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?
husband second marriage
భర్తకి రెండో పెళ్లి చేసిన భార్య.. కారణమేంటంటే!
ktr
మాట నిలబెట్టుకున్న కేటీఆర్.. వారికి రూ. 5 లక్షల సాయం అందజేత!
CM Revanth reddy
మిలియ‌న్ మార్చ్ త‌ర‌హాలో ఆ వేడుక నిర్వహిద్దాం: సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions