Sunday 3rd August 2025
12:07:03 PM
Home > తాజా > ‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’

‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’

KTR About Kalthi Kallu Incident | కూకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగి 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్ లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను వెంటనే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని సూచించారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకాపోవడం చాలా దారుణమని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

You may also like
పీకల్లోతు వరద..శిశువు కోసం తల్లిదండ్రుల అవస్థలు!
‘ఫ్రెండ్షిప్ డే’..భర్తపై భార్య పోస్ట్ వైరల్
శత్రువులు వెన్నుపోటు పొడవలేరు..’ఫ్రెండ్షిప్ డే’ పై ఆర్జీవి పోస్ట్
కృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు..వీడియో వైరల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions