Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. ఎస్పీకి లేఖ!

జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన నిర్ణయం.. ఎస్పీకి లేఖ!

janampally anirudh reddy

Jadcharla MLA Anirudh Reddy | జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఎస్కార్టును తిరస్కరించారు. ఈ మేరకు తనకు పోలీస్ ఎస్కార్ట్ వద్దంటూ మంగళవారం జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.

నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా తాను ఎక్కడికి వెళ్లినా పోలీసు వాహనాలు ఎస్కార్ట్ వస్తున్నాయన్న ఆయన సామాన్య ప్రజలకు పోలీసుల సేవలు ఎంతో అవసరం ఉంటుదని అభిప్రాయపడ్డారు. తన వాహనం ముందు ఎస్కార్ట్ పోలీసులు కేటాయించే సమయాన్ని ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, శాంతిభద్రతలు కల్పించడంలో వినియోగించాలని కోరారు.

పోలీస్ డిపార్ట్మెంట్లో డిమాండ్ కు తగ్గ సిబ్బంది లేనందున తన కోసం పోలీసులను, ఎస్కార్ట్ వాహనాలు వాడొద్దని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఫార్మాట్ లో అనిరుద్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయం జడ్చర్ల నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కాగా జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. కాగా ఎమ్మెల్యే నిర్ణయంపై జిల్లా ఎస్పీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
newly married couple photoshoot in tirumala
‘తెలియక చేశాం.. క్షమించండి’.. ఫొటోషూట్ వివాదంపై కొత్త జంట!
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions