Friday 25th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రైలు ప్రయాణీకులకు శుభవార్త.. అన్నీ సర్వీసులకు ఒకే యాప్!

రైలు ప్రయాణీకులకు శుభవార్త.. అన్నీ సర్వీసులకు ఒకే యాప్!

indian railways

Rail One App | భారతీయ రైల్వే శాఖ (Indian Railway) రైలు ప్రయాణీకులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతం వేరు వేరు సేవలకు వేర్వేరు యాప్ ల ద్వారా అందిస్తున్న సర్వీసులను ఒకే ప్లాట్ ఫాం లోకి తీసుకొచ్చింది.

దీని కోసం రైల్ వన్ (Rail One) పేరుతో ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ ను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Aswini Vaishnav) మంగళవారం ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికుల రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

రిజర్వడ్, అన్ రిజర్వడ్ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫాం టికెట్, రైల్ ఎంక్వైరీ, రియల్-టైమ్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్, PNR స్టేటస్, రీఫండ్‌లు తదిర సేవలన్నింటినీ ఈ రైల్‌వన్ ద్వారా పొందొచ్చు. ఈ రైల్‌వన్ యాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ గూగుల్ ప్లే స్టోర్ మరియు iOS మొబైల్స్ ఆపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ఉచితంగా లభిస్తుంది.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
పెళ్ళికొడుకు వచ్చేంతవరకు ఆగిన రైలు
indian railways
రైల్వే ప్రయాణీకులు శుభవార్త..త్వరలో సూపర్ యాప్.. విశేషమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions