HCU Students Protest News | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, జేసిబీలతో భూమిని చదును చేస్తున్నారు.
మరోవైపు భూముల వేలం ఆపాలని గత కొన్నిరోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు మరియు రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం యూనివర్సిటీ గేట్ లోపల విద్యార్థులు, అధ్యాపకులు నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వం చదును చేస్తున్న భూమి వైపు దూసుకెళ్లే యత్నం చేశారు. దింతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ సైతం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భూములపై నెలకొన్న అపోహలను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు.