Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > ‘HCU వద్ద ఉద్రిక్తత’

‘HCU వద్ద ఉద్రిక్తత’

HCU Students Protest News | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, జేసిబీలతో భూమిని చదును చేస్తున్నారు.

మరోవైపు భూముల వేలం ఆపాలని గత కొన్నిరోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు మరియు రాష్ట్రంలోని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. బుధవారం యూనివర్సిటీ గేట్ లోపల విద్యార్థులు, అధ్యాపకులు నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వం చదును చేస్తున్న భూమి వైపు దూసుకెళ్లే యత్నం చేశారు. దింతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ సైతం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు భూములపై నెలకొన్న అపోహలను తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు స్పష్టం చేశారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions