- బీసీసీఐ, IPL చైర్మన్ కి లేఖ!
Govt Of India Letter To BCCI | ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించిన ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) ఆదివారంతో ముగిసింది. ఈ టోర్నీలో భారత జట్టు ఘన విజయం సాధించి ట్రోఫీ సాధించడంతో భారతీయలు గర్వంగా ఉప్పొంగుతున్నారు.
ఈ టోర్నీ ముగియడంతో క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ వైపు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ ఐపీఎల్ 2025 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్యశాఖ బీసీసీఐతో పాటు ఐపీఎల్ చైర్మన్ కు లేఖ రాసింది.
ఆ ప్రకటనలపై నిషేధంతోపాటు క్రీడాకారులు, కామెంటేటర్లు కూడా ప్రమోట్ చేయడానికి వీళ్లేదని లేఖలో పేర్కొంది. ఐపీఎల్ ను యూత్ ఎక్కువగా వీక్షిస్తుంటంతో పొగాకు, మద్యం యాడ్స్ ప్రభావం వారిపై పడే అవకాశం ఉందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ రాసిన లేఖలో పేర్కొన్నది.