Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

FAKE CURRENCY IN AGRICULTURE LAND | ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సోమవారం నోట్ల కట్టలు పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించారు. కొన్ని కట్టలను తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( Children Bank Of India ) అని ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నకిలీ నోట్లేనని అయితే ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి అనేది మాత్రం విచారణలో మాత్రమే తేలుతుందని సీఐ వెల్లడించారు.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions