Monday 12th May 2025
12:07:03 PM
Home > తాజా > పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

పంట పొలంలో నకిలీ నోట్ల కలకలం

FAKE CURRENCY IN AGRICULTURE LAND | ఓ రైతు పొలంలో సుమారు 40 వరకు రూ.500 నోట్ల కట్టలు దర్శనమివ్వడం కలకలం రేపుతోంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నార్కట్ పల్లి-అద్దంకి రహదారి వెంబడి బొత్తలపాలెం వద్ద ఉన్న ఓ రైతు పొలంలో సోమవారం నోట్ల కట్టలు పడి ఉండడాన్ని స్థానిక రైతులు గుర్తించారు. కొన్ని కట్టలను తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. నోట్లపై ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ( Children Bank Of India ) అని ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ నకిలీ నోట్లేనని అయితే ఇవి ఇక్కడకు ఎలా వచ్చాయి అనేది మాత్రం విచారణలో మాత్రమే తేలుతుందని సీఐ వెల్లడించారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions