Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వెలువడిన తొలి ఫలితం..విజయం ఆమ్ ఆద్మీదే

వెలువడిన తొలి ఫలితం..విజయం ఆమ్ ఆద్మీదే

Delhi Election Results 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. ఉదయం నుండి మొదలైన ఓట్ల లెక్కింపులో బీజేపీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.

మరోవైపు ఆప్ అగ్ర నేతలు వెనుకంజలో ఉండడం ఆసక్తిగా మారింది. సీఎం అతిశీ, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ వంటి కీలక నేతలు ట్రెయిలింగ్ లో కొనసాగుతున్నారు.

మరో ఆప్ నేత మనీష్ సిసోడియా మాత్రం లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో తొలి ఫలితం వెలువడింది. కోండ్లీ స్థానం నుండి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ విజయం సాధించారు.

బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్ పై 6 293 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఖాతా తెరిచింది. లక్ష్మీ నగర్ స్థానం నుండి అభయ్ వర్మ విజయం సాధించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions