Cm Revanth Reddy News | రాష్ట్రంలోని రైతులకు కావాల్సినంత యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఎరువుల కొరత ఉన్నట్లు కొందరు కృత్రిమంగా సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. యూరియా స్టాక్ కు సంబంధించి ప్రతీ ఎరువుల షాప్ దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై డిస్ ప్లే చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే స్టాక్ డిటైల్స్ ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా విషయంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రైతుల కంటే ఏదీ ముఖ్యం కాదని ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. అలాగే సన్నబియ్యం పంపిణీతో రేషన్ కార్డుల విలువ పెరిగిందని సీఎం హర్షం వ్యక్తం చేశారు.










