Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం రేవంత్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..శ్రీకాళహస్తిలో తెలంగాణ భవన్

సీఎం రేవంత్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే..శ్రీకాళహస్తిలో తెలంగాణ భవన్

Bojjala Sudhir Reddy Meets Cm Revanth Reddy | తెలంగాణ ( Telangana ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి ( Jhansi Reddy )ని హైదరాబాద్ లోని వారి నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు.

అనంతరం, శ్రీకాళహస్తి ( Srikalahasthi )లో తెలంగాణ భవన్ ఏర్పాటుపై తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించారు. శ్రీకాళహస్తి దేవస్థానంను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కంకణబద్దులైవున్నట్లు సీఎంకు సుధీర్ రెడ్డి వివరించారు.

ఇందులో భాగంగా శ్రీకాళహస్తిలో అతిధి గృహాలు ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని అందుకోసం దేవస్థానం పరిసర ప్రాంతంలో అర్ద ఎకరం స్థలం కూడా కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాళహస్తిలో తెలంగాణ అతిధి గృహం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions