Thursday 3rd July 2025
12:07:03 PM
Home > తాజా > మూసి ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇల్లు కూల్చకండి

మూసి ప్రక్షాళన చేయండి..కానీ పేదల ఇల్లు కూల్చకండి

BJP Musi Nidra | తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు వేగంగా ముందుకువెళ్తుంది. అయితే మూసి ప్రక్షాళన చేయండి కానీ పేద ప్రజల ఇండ్లు మాత్రం కూల్చకండి అంటూ బీజేపీ డిమాండ్ ( Demand ) చేసింది.

ఈ మేరకు మూసి పరివాహిక ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు మూసి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్పెట్ ( Amberpet ) నియోజకవర్గం తులసిరాం నగర్ బస్తీలో ప్రజలతో ఒకరోజంతా గడిపరు.

అంబోజి శంకరమ్మ ఇంట్లో రాత్రి భోజనం చేశారు. అనంతరం బస చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు.

ప్రజాపాలన అంటే ఇల్లు కులగొట్టడమా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలన్నారు.

You may also like
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !
‘సంపూర్ణ సహకారం అందిస్తాం..ఈటల కీలక వ్యాఖ్యలు’
‘రాగి సంకటి, చేపల పులుసు వద్దు..రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం’
‘పాశమైలారం ఘటన..మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions