Saturday 24th May 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మసీదుకు వెళ్తే టోపీ పెట్టుకుంటారు కదా.. జగన్ కు బీజేపీ ఎంపీ కౌంటర్!

మసీదుకు వెళ్తే టోపీ పెట్టుకుంటారు కదా.. జగన్ కు బీజేపీ ఎంపీ కౌంటర్!

Raghunandan Rao

Raghunandan Rao Counter To Jagan | తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంపై దుమారం రేగుతున్న తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం తిరుమల వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దైంది.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో డిక్లరేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణలోని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ డిక్లరేషన్ వివాదంపై వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ తిరుమల వెళ్తానంటే బీజేపీ అడ్డుకోలేదన్నారు.

డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేక జగన్ బీజేపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలోనే ఉందని రఘునందన్ రావు గుర్తు చేశారు. మసీదులోకి వెళ్తే టోపీ, కర్చీఫ్ పెట్టుకుంటున్నారని, అలాంటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలి కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

You may also like
vijay sai reddy
రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై.. ఇక నా భవిష్యత్తు అదేనంటూ..!
గాయపడిన కార్యకర్తను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్!
ys vijayamma
YS Family ఆస్తుల వివాదం.. విజయమ్మ సంచలన లేఖ!
Bhumana karunakar reddy
జగన్ ని అది అడిగితే పతనం ఖాయం: భూమన హెచ్చరిక!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions