Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > టీం ఇండియాకు న్యూ స్పాన్సర్..ఒక్కో మ్యాచుకు ఎన్ని రూ.కొట్లో తెలుసా

టీం ఇండియాకు న్యూ స్పాన్సర్..ఒక్కో మ్యాచుకు ఎన్ని రూ.కొట్లో తెలుసా

BCCI-Apollo sponsorship | భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ గా అపోలో టైర్స్ నిలిచింది. ఈ మేరకు బీసీసీఐతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన డీల్ గా నిలిచినట్లు కథనాలు వస్తున్నాయి.

టీం ఇండియాకు జెర్సీ స్పాన్సర్‌గా డ్రీమ్-11 మొన్నటివరకు కొనసాగింది. అయితే ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని కారణంగా డ్రీమ్11 తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అనంతరం బీసీసీఐ డ్రీమ్-11తో ఉన్న ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజగా బిడ్డింగ్ నిర్వహించింది. ఇందులో అపోలో టైర్స్ అధిక బిడ్ వేసి గెలిచింది. మూడు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది. దీని మొత్తం విలువ రూ.579 కోట్లు. ఈ మూడేళ్ళ కాలంలో భారత్ 130కి పైగా ద్వైపాక్షిక మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అలాగే 21 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులు ఆడుతుంది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్ కోసం రూ.4.5 కోట్లు చెల్లించనుంది. ఇకపోతే డ్రీమ్-11 రూ.4 కోట్లు చెల్లించేది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions