Andhra Teacher Gets Foot Massage From Students | ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ మహిళా టీచర్ చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. సదరు టీచర్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండగా ఇద్దరు విద్యార్ధినీల ఆమె పాదాలను నొక్కుతున్నారు.
ఈ సమయంలో ఆ పంతులమ్మ బిజీగా ఫోన్లో మాట్లాడుతుంది. ఈ ఘోర ఘటన జిల్లాలోని మొళియపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే ఇలా ప్రవర్తించడం పట్ల సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం సదరు టీచర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.అలాగే ఘటనపై విచారణ సైతం కొనసాగుతోంది.










