Friday 31st July 2026
12:07:03 PM
Home > క్రీడలు > టీం ఇండియాకు న్యూ స్పాన్సర్..ఒక్కో మ్యాచుకు ఎన్ని రూ.కొట్లో తెలుసా

టీం ఇండియాకు న్యూ స్పాన్సర్..ఒక్కో మ్యాచుకు ఎన్ని రూ.కొట్లో తెలుసా

BCCI-Apollo sponsorship | భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ గా అపోలో టైర్స్ నిలిచింది. ఈ మేరకు బీసీసీఐతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన డీల్ గా నిలిచినట్లు కథనాలు వస్తున్నాయి.

టీం ఇండియాకు జెర్సీ స్పాన్సర్‌గా డ్రీమ్-11 మొన్నటివరకు కొనసాగింది. అయితే ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని కారణంగా డ్రీమ్11 తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అనంతరం బీసీసీఐ డ్రీమ్-11తో ఉన్న ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజగా బిడ్డింగ్ నిర్వహించింది. ఇందులో అపోలో టైర్స్ అధిక బిడ్ వేసి గెలిచింది. మూడు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది. దీని మొత్తం విలువ రూ.579 కోట్లు. ఈ మూడేళ్ళ కాలంలో భారత్ 130కి పైగా ద్వైపాక్షిక మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అలాగే 21 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులు ఆడుతుంది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్ కోసం రూ.4.5 కోట్లు చెల్లించనుంది. ఇకపోతే డ్రీమ్-11 రూ.4 కోట్లు చెల్లించేది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions