Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు

ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు

Bandi Sanjay Hot Comments On KTR | మసకబారిన వ్యక్తిగా రాహుల్ గాంధీ ( Rahul Gandhi )స్థానాన్ని కేటీఆర్ ( KTR ) భర్తీ చేసే విధంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).

కాగా ఓటుకు నోటు కేసులో వీడియోతో సహా ప్రస్తుత సీఎం రేవంత్ ( Revanth Reddy )పట్టుబడితే ఆయన్ను జైల్లో వేయడంలో బీజేపీ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు.

మొదట అమెరికా నుండి రాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ కు బండి స్వాగతం పలికారు. జెట్ లాగ్ ( Jet Lag ), అమెరికా పర్యటన కేటీఆర్ పై ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.

ఓటుకు నోటు కేసు ఏసీబీ ( ACB ) పరిధిలో ఉందని, 2015 నుండి అసమర్ధ బీఆరెస్ ప్రభుత్వం విచారణ చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కానీ, ఇప్పుడు ట్విట్టర్ స్టార్ డం ( Twitter Stardom ) కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో నిజంగా న్యాయం కావాలంటే, అప్పుడే కేసును సీబీఐకి లేదా ఈడీకి అప్పగించి ఉండాల్సిందని తెలిపారు.

You may also like
bandi sanjay
‘ఆ కుటుంబానికి రూ.1000 కోట్లుపంపేందుకే కేబినెట్ మీటింగా?’
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
bio asia summit 2026
ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి
ktr comments in kcr birthday celebrations
మనం కేసీఆర్ కు ఇచ్చే పుట్టిన రోజు కానుక అదే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions