Sunday 14th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్

పిరమైన మోదీగారు.. విషం చిమ్మకండి: కేటీఆర్

ktr

KTR Post on Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం నిమిత్తం మంగళవారం రాత్రి తెలంగాణకు రానున్నారు. వరంగల్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

కాగా మోదీ పర్యటన నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు.

” పిరమైన ప్రధాని నరేంద్రమోదీ గారు, దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..! దశాబ్దకాలంలో ఏం చేశారో విషయం చెప్పి ఓట్లడగండి..!! ప్రధానిగా పదేళ్లు గడిచినా..

తెలంగాణ ప్రధాన హామీలను ఎందుకు మరిచారో చెప్పండి..!! మా నవతరానికి కొండంత భరోసానిచ్చే.. ఐటీఐఆర్  ITIR, Hyderabad ప్రాజెక్టును ఎందుకు ఆగం చేశారో చెప్పండి..!! దేశం కోసం ఏదైనా “విజన్” ఉంటే చెప్పండి..!

కానీ.. దయచేసి సమాజంలో “డివిజన్” మాత్రం సృష్టించకండి..!! రెచ్చగొట్టే రాజకీయాలకు.. ఇక్కడ ఓట్లు పడవు..! ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ..!!” అని కేటీఆర్ కీలక సూచనలు చేశారు.

You may also like
modi touches feet of an old man
వేదికపైనే వృద్ధుడి పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ.. ఆయన ఎవరంటే!
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions