Friday 13th June 2025
12:07:03 PM
Home > తాజా > బూందీతో మొదలై లడ్డూగా మారిన శ్రీవారి ప్రసాదం

బూందీతో మొదలై లడ్డూగా మారిన శ్రీవారి ప్రసాదం

Tirumala Laddu History | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల శ్రీవారి ప్రసాదం అయిన లడ్డూ చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది.

లడ్డూలో జంతు కొవ్వును వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలో అసలు తిరుమలలో ప్రసాదంగా లడ్డూను ఎప్పటి నుండి అందిస్తున్నారు అనేది ఆసక్తిగా మారింది.

1804 సంవత్సరం వరకు బూందీని తీపి ప్రసాదంగా తిరుమలలో పంచినట్లు ఆలయ పండితులు చెబుతున్నారు. కాలక్రమనే 1940 దశకం నాటికి తిరుమలలో లడ్డూను ప్రసాదంగా భక్తులకు అందించడం ప్రారంభం అయ్యింది.

విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. మరోవైపు తిరుమల దేవస్థానంలో ప్రత్యేకంగా మూడు రకాల లడ్డులను తయారుచేస్తారు.

కళ్యాణం లడ్డూ లేదా పెద్ద లడ్డూ, రెండవది ఆస్థానం లడ్డూ వీటిని ఆలయంలో జరిగే ఆస్థాన సమయంలో తయారుచేస్తారు. మూడవది చిన్న లడ్డూ. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ఈ లడ్డూలనే అందిస్తారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions