Telangana BJP On HYDRA | అక్రమ నిర్మాణాలను కులుస్తూ ఆక్రమిత స్థలాలను స్వాధీనం చేసుకుంటూ హైడ్రా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఇందులో ఎటువంటి రాజకీయ లక్ష్యం లేదని సీఎం రేవంత్ ( Cm Revanth ) స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ( Telangana BJP ) హైడ్రాపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరింది. ప్రధానంగా మూడు నిర్మాణాలపై చర్యలు తీసుకుంటే హైడ్రా యొక్క అసలు ఉద్దేశాలు స్పష్టం అవుతాయని బీజేపీ పేర్కొంది.
మొదట సల్కం చెరువును ఆక్రమించి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) కి చెందిన సంస్థలు, కేటీఆర్ ఫార్మ్ హౌస్ ( Janwada Farmhouse ) మరియు ఇతర బీఆరెస్ నాయకుల అక్రమ నిర్మాణాలపై, కాంగ్రెస్ నేతల ఫార్మ్ హౌస్ లపై చర్యలు తీసుకున్నప్పుడే హైడ్రా అసలు ఉద్దేశ్యం నిరూపితం అవుతుందని బీజేపీ తెలిపింది.
కానీ వీటిపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ ప్రభుత్వానికి ఉందా ? అని కాషాయ పార్టీ ప్రశ్నించింది.