Sunday 8th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్నా’

‘తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని కోరుకున్నా’

cbn
  • తిరుమలలో టీడీపీ అధినేత చంద్రబాబు..!

Chandra Babu Visits Tirumala | ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) శుక్రవారం ఉదయం సతీసమేతంగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ, ప్రసాదాలు అందించారు అర్చకులు.

దర్శన అనంతరం మీడియా తో మాట్లాడిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వేంకటేశ్వరుడి పాద పద్మాల చెంత పుట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.

2003 లో మావోయిస్టులు దాడి చేసినప్పుడు సాక్షాత్తు వేంకటేశ్వరుడే తనకు ప్రాణ భిక్ష పెట్టినట్లు పేర్కొన్నారు.

అందుకే ఇటీవల తనకు కష్టం వచ్చినప్పుడు కూడా స్వామి వారిని మొక్కుకున్నానీ, ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుమల వచ్చానని చెప్పారు చంద్రబాబు.

ప్రపంచంలో దేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి నంబర్ 1 గా ఉండలాని కోరుకున్నట్లు స్పష్టం చేశారు.

ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్ధ్యాలు తనకు ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.

You may also like
ap pension
భారీ వర్షాలు..పెన్షన్ల పంపిణీ పై సీఎం కీలక నిర్ణయం!
chandra babu
దేశ సమగ్రత కాపాడటం మనందరి కర్తవ్యం: సీఎం చంద్రబాబు
ap cm
సీఎం చంద్రబాబు తొలి పర్యటన.. పోలవరం సందర్శన!
chandra babu
CM Chandrababu: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఎన్ని పోస్టులంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions