SSMB29 Movie Pooja Ceremony | హైదరాబాద్: తెలుగు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ( SS Rajamouli ) దర్శకత్వంలో మహేశ్ బాబు నటించే భారీ ప్రాజెక్ట్ “SSMB 29” సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గురువారం హైదరాబాద్లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమం నిర్వహించినట్లు సమాచారం. హీరో మహేశ్ బాబు (Mahesh babu) కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు పలు వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే సినిమా ప్రారంభంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
ఈ సినిమాను వేసవి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. సినిమా మొత్తం ఒకే భాగంగా వచ్చేలా లేదా రెండు భాగాల్లో విడుదల చేసే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రంలో పలు కీలక పాత్రలు పోషిస్టున్నట్లు పుకార్లు వస్తున్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంతో ఈ సినిమా సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.