Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > భువనగిరిలో బీజేపీ జెండా ఎగరేద్దాం: బూర నర్సయ్య గౌడ్

భువనగిరిలో బీజేపీ జెండా ఎగరేద్దాం: బూర నర్సయ్య గౌడ్

  • మరోసారి మోదీని ప్రధానిని చేద్దాం
  • బీజేపీతోనే దేశాభివృద్ధి
  • శివారెడ్డిగూడెం నుంచి బీజేపీలో ముఖ్య నేతల చేరిక

కపోతం, భూదాన్ పోచంపల్లి: సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి బీజేపీ జెండా ఎగరేసి మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. భూదాన్ పోచంపల్లి మండలంలోని శివారెడ్డి గూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆరెస్, కాంగ్రెస్ నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ వారందరికీ కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ప్రధాని మోదీ నేతృత్వంలోనే భారత్ ప్రపంచంలో ఐదో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని తెలిపారు. మోదీతోనే త్రీడీ (దేశం, ధర్మం, డెవలప్ మెంట్) సాధ్యమని పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా పాటుపడాలని పిలుపునిచ్చారు.

శివారెడ్డి గూడెం నుంచి వారాల మల్లారెడ్డి మాట్లాడుతూ భువనగిరిలో డాక్టర్ నర్సయ్య గౌడ్ అందరికీ సుపరిచితులనీ, ఆయన్ని గెలుపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే మన దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మేకల జంగారెడ్డి, చిలుముల వెంకట్ రెడ్డి, ముడుపూరి రాజారాం రెడ్డి, వారాల లచ్చిరెడ్డి, వారాల మల్లారెడ్డి, ముడుపూరి జంగారెడ్డి, మేకల కరుణాకర్ రెడ్డి, వారాల కొండల్ రెడ్డి, చిలుముల శేఖర్ రెడ్డి, పీసర్ల జగన్ మోహన్ రెడ్డి, మేకల రామకృష్ణా రెడ్డి, మొద్దు బస్వారెడ్డి, మొద్దు సత్తిరెడ్డి, మొద్దు రామ్ రెడ్డి, సీత శ్రీను, బొక్క నర్సిరెడ్డి, ముప్పారం బాబు చారి, వారాల రాజిరెడ్డి, మొద్దు ప్రశాంత్ రెడ్డి, గంగిరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions