Sunday 8th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..సొంత డబ్బులతో ఆటస్థలం

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్..సొంత డబ్బులతో ఆటస్థలం

Pawan Kalyan has donated 60 lakhs to acquire land for Playground | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan ) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

రైల్వే కోడూరు ( Railway Kodur ) నియోజకవర్గం, మైసూరవారిపల్లి ( Mysorevaripalli ) గ్రామంలోని పాఠశాలకు రూ.60 లక్షల సొంత నిధులతో ఆటస్థలం కొనుగోలు చేసి ఇచ్చారు.

ఆగస్ట్ నెలలో మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం ( Playground ) లేదన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని పవన్ మాటిచ్చారు.

ఇందులో భాగంగా బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు.

ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్టు ( Trust ) ద్వారా రూ.60 లక్షలు వెచ్చించి ఎకరం స్థలం కొనుగోలు చేసి పవన్ కళ్యాణ్ ఇచ్చారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions