Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > కృష్ణా నదిపై 3 కి.మీ. వంతెన..అమరావతికి కొత్త రైల్వేలైన్

కృష్ణా నదిపై 3 కి.మీ. వంతెన..అమరావతికి కొత్త రైల్వేలైన్

New Railway Line For Capital Amaravati | ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం అయ్యింది. ఈ మేరకు రాజధాని పనులను పునః ప్రారంభించారు.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమరావతి గుడ్ న్యూస్ ( Good News ) చెప్పింది. హైదరాబాద్ ( Hyderabad ), చెన్నై ( Chennai ) సహా దేశంలోని ప్రధాన నగరాలను అమరావతికి కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టు చేపట్టనున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Ashwini Vaishnaw ) ప్రకటించారు.

ఈ మేరకు రూ.2,245 కోట్ల అంచనాతో 57 కి.మీ మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర పొడవైన వంతెనను నిర్మించనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసందానిస్తూ ఈ రైల్వే లైన్ ఏర్పాటు కానుంది.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions