Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > కేటీఆర్ రూ.100 కోట్ల పరువునష్టం దావా..కొండా సురేఖపై కోర్టు సీరియస్

కేటీఆర్ రూ.100 కోట్ల పరువునష్టం దావా..కొండా సురేఖపై కోర్టు సీరియస్

Nampally Court Serious On Konda Surekha | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Ktr ) నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే.

తాజగా విచారణ చెపట్టిన న్యాయస్థానం, మంత్రికి మొట్టికాయలు వేసింది. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు తెలిపింది.

ఈ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్ ఫార్మ్ ల నుండి తొలగించాలని ఆదేశించింది. మరోసారి కేటీఆర్ పై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్‌ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తనపై, సాటి మహిళ సమంత ( Samantha ) మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని కేటీఆర్ అన్నారు.

You may also like
‘దేశ రక్షణ నిధికి ఏపీ స్పీకర్ విరాళం’
‘పాక్ కు లోన్..IMF పై విరుచుకుపడ్డ ఒవైసీ’
‘భారత్-పాక్ ఉద్రిక్తతలు..డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన’
‘పాక్ లో పట్టుబడ్డ భారత పైలట్..నిజం ఏంటంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions