Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > కేటీఆర్ రూ.100 కోట్ల పరువునష్టం దావా..కొండా సురేఖపై కోర్టు సీరియస్

కేటీఆర్ రూ.100 కోట్ల పరువునష్టం దావా..కొండా సురేఖపై కోర్టు సీరియస్

Nampally Court Serious On Konda Surekha | రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( Ktr ) నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే.

తాజగా విచారణ చెపట్టిన న్యాయస్థానం, మంత్రికి మొట్టికాయలు వేసింది. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేఖ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని కోర్టు తెలిపింది.

ఈ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి ఫ్లాట్ ఫార్మ్ ల నుండి తొలగించాలని ఆదేశించింది. మరోసారి కేటీఆర్ పై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్‌ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి తనపై, సాటి మహిళ సమంత ( Samantha ) మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని కేటీఆర్ అన్నారు.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions