Thursday 29th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పొత్తు ఉంటే వైసీపీ..లేకుంటే బీజేపీ లోకి: ముద్రగడ ఆలోచన

పొత్తు ఉంటే వైసీపీ..లేకుంటే బీజేపీ లోకి: ముద్రగడ ఆలోచన

Mudragada News| సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ( Mudragada Padmanabham ) రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.

గురువారం ఉదయం ఎంపీ, వైసీపీ ( Ycp ) రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ( Mithun Reddy ) ముద్రగడ ను ఆయన నివాసంలో కలిశారు. సీఎం జగన్ ( Cm Jagan ) ఆదేశాల మేరకే ముద్రగడతో భేటీ అయినట్లు తెలిపారు మిథున్ రెడ్డి.

ఈ నేపథ్యంలో ముద్రగడ వైసీపీ లో చేరుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ముద్రగడ మాత్రం తనకున్న ఇతర అవకాశాలను కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కనుక టీడీపీ ( Tdp ), జనసేన ( Janasena )పార్టీలతో పొత్తు పెట్టుకోకపోతే మాత్రం ముద్రగడ కాషాయ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగా వెళ్తే తెలంగాణ ( Telangana )లో బీసీ సీఎం ( BC Cm ) నినాదం తో ఏ విదంగానైతే ఎన్నికలకు వెళ్లాయో అదే తరహాలో ఏపీ లో కూడా కాపు ముఖ్యమంత్రి నినాదంతో వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ ఊహాగానాలు నడుమ ముద్రగడ బీజేపీలో చేరితే ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే కథనాలు కూడా వచ్చాయి. ఈ మేరకు గురువారం ఉదయం ఏపీ బీజేపీ ( Ap Bjp ) నేతలు కూడా ముద్రగడ తో భేటీ అయ్యారు.

దింతో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రాలో ఎటువంటి పొత్తు లేకుంటే తాను బీజేపీ చేరుతానని లేదంటే వైసీపీ లో చేరుతానని ఎంపీ మిథున్ రెడ్డికి ముద్రగడ స్పష్టం చేసినట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions