Megastar Chiranjeevi Meets Cm Chandrababu | దసరా పండుగ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu ) నివాసానికి మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) వెళ్లారు.
కొద్దిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెల్సిందే. వరద బాధితుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి తెలుగురాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆయన తరఫున రెండు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ ( Hyderabad ) లోని చంద్రబాబు నివాసానికి మెగాస్టార్ వెళ్లారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అలాగే తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు.
విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.