Friday 1st May 2026
12:07:03 PM
Home > క్రీడలు > ‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!

‘అదే జరిగుంటే ఇండియా ఫైనల్స్ లో గెలిచేది..’: మమతా బెనర్జీ!

mamata banerjee

Mamata Banerjee Comments ICC Final | వరల్డ్ కప్ ఫైనల్స్ (ICC World Cup) లో ఇండియా ఓడిపోవడంపై రాజకీయ రంగు పులుముకుంది.

బీజేపీ, ప్రధాని మోదీ చర్యల మూలంగానే టీం ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం లో కాకుండా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ లేదా ముంబై వాంఖడే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించి ఉంటే భారత్ గెలిచేదని అభిప్రాయపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.

గురువారం టీఎంసీ కార్యకర్తలు సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు మమత. అలాగే క్రికెట్ ని, దేశాన్ని కాషాయ రంగులోకి మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు.

ఇదిలా ఉండగా లక్నో స్టేడియం లో ఫైనల్స్ జరిగి ఉంటే టీం ఇండియా కచ్చితంగా విజయం సాధించేదని స్పష్టం చేశారు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.

లక్నో లో గనుక మ్యాచ్ జరిగి ఉంటే విష్ణు దేవుడి, మాజీ పీఎం అటల్ బిహారి వాజ్ పేయి ఆశీస్సులు కూడా ఉండేవని పేర్కొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions