Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > కొండా సురేఖకు మరో బిగ్ షాక్

కొండా సురేఖకు మరో బిగ్ షాక్

KTR Files Defamation Case On Konda Surekha | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ ( Konda Surekha ) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna ) నాంపల్లి కోర్టులో క్రిమినల్ ( Criminal ) పరువునష్టం దావా వేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖకు మరో బిగ్ షాక్ తగిలింది.

కొండా సురేఖపై కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో గురువారం పరువునష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆరెస్ నేతలు బాల్క సుమన్ ( Balka Suman ), దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, తుల ఉమను సాక్ష్యులుగా పేర్కొన్నారు.

మరోవైపు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions