Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘సింహం’ గుర్తుపై కవిత మద్దతుదారుల పోటీ

‘సింహం’ గుర్తుపై కవిత మద్దతుదారుల పోటీ

Kalvakuntla Kavitha News | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా, బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. బుధవారం జరిగిన ఈ చర్చల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు కవిత సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions