Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘సింహం’ గుర్తుపై కవిత మద్దతుదారుల పోటీ

‘సింహం’ గుర్తుపై కవిత మద్దతుదారుల పోటీ

Kalvakuntla Kavitha News | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనుండగా, బుధవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరిపారు. బుధవారం జరిగిన ఈ చర్చల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు కవిత సమక్షంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ జావెద్ లతీఫ్, ఉపాధ్యక్షులు కె.బుచ్చిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లోనూ కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions