Sunday 15th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 19 ఏళ్ల తర్వాత భారతీయ తండ్రినికలిసిన జపాన్ కుమారుడు!

19 ఏళ్ల తర్వాత భారతీయ తండ్రినికలిసిన జపాన్ కుమారుడు!

Japanese Son Reunites With Indian Father After 19 Years | భారత్ లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు జపాన్ ( Japan ) కు చెందిన ఓ కుమారుడు. 19 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత ఆ తండ్రీ కొడుకుల కలయిక అందరీ హృదయాలను హత్తుకుంది.

పంజాబ్ అమృత్ సర్ ( Amritsar ) కు చెందిన సుఖ్ పాల్ సింగ్ ( Sukhpal Singh ) థాయిలాండ్ ( Thailand ) దేశంలో సాచీ ( Sachie ) అనే జపనీస్ మహిళను 2002లో వివాహం చేసుకున్నారు. అనంతరం వారు జపాన్ రాజధాని టోక్యో ( Tokyo ) స్థిరపడ్డారు.

2003 వారికి రిన్ ( Rin ) అనే కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల తర్వాత దంపతులు విడిపోయారు. ఆ తర్వాత సుఖ్ పాల్ సింగ్ స్వదేశానికి తిరిగొచ్చారు.

దీంతో కుమారుడు రిన్ తండ్రితో మరియు తండ్రి కుటుంబంతో పూర్తిగా సంబంధాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం రిన్ ఒసాకా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ ( Osaka University Of Arts ) లో చదువుతున్నాడు. ఈ సమయంలో వంశ వృక్షం ( Family Tree )అనే ప్రాజెక్టు రిన్ ను తండ్రిని కలిసేలా ప్రేరేపించింది.

అతికష్టం మీద రిన్ తన తండ్రి జాడను కనుగొన్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 18న పంజాబ్ లోని తన తండ్రి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి, కుమారుల కలయిక భావోద్వేగంగా సాగింది. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
‘నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల బామ్మ, తల్లీకూతురు’
‘భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కుతిన్న భర్త’
‘పదిలో ఫెయిల్..తల్లిదండ్రులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions