Thursday 19th September 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జానీ మాస్టర్ పై అత్యాచార కేసు..జనసేన పార్టీ కీలక నిర్ణయం

జానీ మాస్టర్ పై అత్యాచార కేసు..జనసేన పార్టీ కీలక నిర్ణయం

Jani Master Case News | ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్  ( Choreographer ) జానీ మాస్టర్ ( Jani Master ) పై రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ లో అత్యాచార కేసు నమోదైన విషయం తెల్సిందే. తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ( Janasena Party ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు షేక్ జానీని ఆదేశించినట్లు పార్టీ స్పష్టం చేసింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2024 లో సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆయన పార్టీ తరఫున ప్రచారం చేశారు.

You may also like
ప్రపంచ రికార్డ్ అందుకున్న పవన్ కళ్యాణ్ శాఖ
జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు..అసలేం జరిగిందంటే !
pawan kalyan
‘కౌన్ బనేగా కరోడ్పతి’ లో పవన్ కళ్యాణ్ పై ప్రశ్న
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions