Sunday 27th April 2025
12:07:03 PM
Home > క్రీడలు > మార్చి 2 నుంచి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌

మార్చి 2 నుంచి ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌

Indian Street Premier League from March 2

స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐఎస్‌పీఎల్‌) క్రికెట్‌ పోటీలను వచ్చే ఏడాది మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు సెలక్షన్‌ కమిటీ విభాగాధిపతి జతిన్‌ పరంజపే తెలిపాడు. హైదరాబాద్‌లోని ది పార్క్‌ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రికెటర్‌ ఎస్‌కే ఖమ్రుద్దీన్‌తో కలిసి వివరాలు వెల్లడించారు.
దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు కొంత భిన్నంగా ఉండే ఈ పోటీలను గ్రేస్‌ బాల్‌కు బదులు టెన్నీస్‌ బాల్‌తో నిర్వహిస్తామన్నారు. మిగతా ఫార్మాట్‌ మొత్తం ఐపీఎల్‌ మాదిరిగానే ఉంటుందన్నారు. ఈ పోటీల్లో రాణించిన వారికి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే నేతృత్వంలో క్రీడాకారుల ఎంపిక జరుగుతుందన్నారు. వేలం ద్వారా ఒక్కో క్రీడాకారుడికి రూ.3లక్షల నుంచి రూ.50లక్షల ధర పలుకుతుందని చెప్పారు.

You may also like
‘లారీతో ఢీ కొట్టి వేట కొడవళ్ళతో..ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య’
‘పహల్గాం ఉగ్రదాడి..NIA చేతికి కీలక ఆధారం’
‘ప్రతీ భారతీయుడి రక్తం మరుగుతోంది’
‘బీఆరెస్ రజతోత్సవం..కేసీఆర్ కోసం వెండి శాలువా’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions