Tuesday 13th May 2025
12:07:03 PM
Home > Uncategorized > 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నాం : HYDRA

43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నాం : HYDRA

Hydra News | చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా ( Hydra ) ఉక్కుపాదం మోపుతోంది. నిత్యం ఏదొక నిర్మాణాన్ని నేలమట్టం చేస్తూ హైడ్రా హాట్ టాపిక్ గా మారింది.

ప్రముఖ సినీ నటుడు నాగార్జున ( Akkineni Nagarjuna ) కు చెందిన ఎన్ కన్వెన్షన్ ( N Convention ) ను నేలమట్టం చేయడంతో అందరి చూపు హైడ్రా వైపు మళ్లింది. ఈ క్రమంలో కూల్చివేసిన నిర్మాణాలు, స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూముల నివేదికను హైడ్రా ప్రభుత్వానికి సమర్పించింది.

18 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టినట్లు, ఏకంగా 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు నివేదికలో పొందుపరిచారు.

ఇందులో నాగార్జున ఎన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ ( Pro Kabaddi ) యజమాని అనపమ, కావేరి సీడ్స్ ( Kaveri Seeds ) ఓనర్ భాస్కర రావు, మంథని బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పురా ( Bahadurpura ) ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, దానం నాగేందర్ మద్దతుదారుడు, కాంగ్రెస్ నేత పల్లం రాజు సోదరుడికి చెందిన నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది.

You may also like
‘దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు’
‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’
సింగపూర్ లో సీఎం రేవంత్..ఆ దేశ మంత్రితో భేటీ
AV RANGANATH
ఆ నిర్మాణాలను కూల్చం: హైడ్రా రంగనాథ్ కీలక ప్రకటన!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions