Heavy Rains In Vijayawada | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అకాల వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడ ( Vijayawada ) భారీ వర్షాలతో అతలాకుతలం అయింది.
30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎక్కరోజే ఏకంగా 29 సెంటిమీటర్ల ( Centi Meters ) వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లో వరద నిలిచిపోయింది. శనివారం పట్టణంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెల్సిందే.
ఇదిలా ఉండగా విజయవాడ-నూజీవీడు ( Vijayawada-Nujivid ) మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు.
నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇల్లు నీట మునిగాయి. రైల్వేట్రాక్ ( Railwaytrack ) అండర్ పాస్ వద్ద నాలుగు బస్సులు నీట మునిగాయి. అధికారులు క్రేన్ల సహాయంతో వాటిని బయటకు తీశారు.