Sunday 8th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..వర్షాలకు బెజవాడ అతలాకుతలం

30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా..వర్షాలకు బెజవాడ అతలాకుతలం

Heavy Rains In Vijayawada | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో అకాల వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలో ప్రధాన నగరమైన విజయవాడ ( Vijayawada ) భారీ వర్షాలతో అతలాకుతలం అయింది.

30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎక్కరోజే ఏకంగా 29 సెంటిమీటర్ల ( Centi Meters ) వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లో వరద నిలిచిపోయింది. శనివారం పట్టణంలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతిచెందిన విషయం తెల్సిందే.

ఇదిలా ఉండగా విజయవాడ-నూజీవీడు ( Vijayawada-Nujivid ) మధ్య రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురుకుంటున్నారు.

నున్న ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఇల్లు నీట మునిగాయి. రైల్వేట్రాక్ ( Railwaytrack ) అండర్ పాస్ వద్ద నాలుగు బస్సులు నీట మునిగాయి. అధికారులు క్రేన్ల సహాయంతో వాటిని బయటకు తీశారు.

You may also like
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘కీలక ఒప్పందం..మూడేళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ’
‘చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా చంద్రబాబు తీరు’
‘ప్రజల రాజధాని కోసం కేంద్రం సహకారం మరవలేనిది’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions