Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఢిల్లీ బ్లాస్ట్..అసలేం జరిగిందంటే !

ఢిల్లీ బ్లాస్ట్..అసలేం జరిగిందంటే !

Delhi Car Blast | దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం కారులో అత్యంత తీవ్రతతో ఓ భారీ పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీలోని ఎర్ర కోట, చాందినీ చౌక్ మధ్యనున్న రోడ్డు మీద సరిగ్గా సిగ్నల్ జంక్షన్ లో నవంబర్ 10, సోమవారం సాయంత్రం 6 గంటల 52 నిమిషాలకు HR 26 CE 7674 నంబర్ గల హ్యుండాయ్ ఐ20 కారులో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇప్పటివరకు 12 మంది మృతిచెందారు.

బ్లాస్ట్ జరిగిన సమయంలో తొమ్మిది మంది, ఆ తర్వాత చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరగడానికంటే ముందు ఈ కారు ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ ఏరియాలో సుమారు మూడు గంటలు పార్క్ చేసి ఉంది. సాయంత్రం 3.19 గంటల నుంచి, 6 గంటల 48 నిమిషాల వరకు పార్కింగ్ ఏరియాలో ఉన్న కారు ఆ తర్వాత బయటకు వచ్చి నిదానంగా కదులుతూ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పేలింది. ఆ వెంటనే సమీపంలోని డజనుకు పైగా వాహనాలకు మంటలు అందుకున్నాయి. ఇది ఫిదాయిన్ శైలిలో జరిగిన ఉగ్రదాడి అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions