Congress Party Donates To Help Flood Victims | ఇటీవల వచ్చిన ప్రళయ వరదలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం ( Khammam ), మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.
ఎందరో సామాన్యులు సర్వస్వం కోల్పోయారు. బాధితుల కష్టాలను దూరం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు.
ఇందులో భాగంగా వరద బాధితుల సహయార్ధం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) భారీ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ( Corporation Chairman’s ) తమ రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) సూచనల మేరకు కాంగ్రెస్ ఈ విరాళం ప్రకటించింది.