Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా’

‘లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా’

Congress MLA Bathula Laxma Reddy in Telangana donates Rs 2 crore for farmer’s | మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసి ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఈ మేరకు బత్తుల లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల చెక్కును సీఎంకు అందజేసి, ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్యే కుమారుడి సాయి ప్రసన్న వివాహం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని డబ్బులను రైతుల కోసం కేటాయించిట్లు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను అభినందించారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions