Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..!

కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Cm Revanth Reddy Visited Kcr| మాజీ సీఎం, బీఆరెస్ ( Brs ) సుప్రీమో కేసీఆర్ ( Kcr ) ను సోమజిగూడలోని యశోదా ఆసుపత్రిలో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy).

ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి చేరుకున్న సీఎం, కేసీఆర్ ను కలిసి ఆరోగ్యం పై ఆరా తీసి పరామర్శించారు. అలాగే వైద్యులను, కుటుంబసభ్యులను కలిసి సర్జరీ ( Surgery ) పై అడిగి తెలుసుకున్నారు.

త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆసుపత్రిలో మాజీ మంత్రులు కేటీఆర్ ( Ktr ), హరీష్ రావు ( Harish Rao ) లను కలిశారు సీఎం. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు కేసీఆర్ ఎడమ తుంటికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెల్సిందే.

ఆ తర్వాత వాకర్ ( Walker ) సహాయంతో కేసీఆర్ ను నడిపించారు వైద్యులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించడం మంచి పరిణామం గా భావిస్తున్నారు.

కాగా వ్యక్తిగత వైరాలు పక్కనపెట్టి, సీఎం వెళ్లి ప్రతిపక్ష నేతను పరామర్శించడం మంచి సంప్రదాయం అని అంటున్నారు అందరూ. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి సీతక్క ( Seethakka ), సీనియర్ నేతలు షబ్బీర్ అలీ ( Shabbir Ali ), వేం నరేందర్ రెడ్డిలు ఉన్నారు.

You may also like
cm revant reddy completes course in usa
అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’
cm revanth reddy
టీ-హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు.. స్పందించిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions