BJP Leader Purandeswari Meets Nirmala Sitharaman | క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం అని నొక్కిచెప్పారు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ మేరకు క్రెడిట్ కార్డుల విషయంలో RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.










