APPSC Postponed The Group-2 Mains Exam | ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ ( Group-2 Mains ) పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రభుత్వం లేఖను రాసింది.
ఈ మేరకు ఏపీపిఎస్సి ( APPSC ) సెక్రటరీకి ప్రభుత్వం లేఖను రాసింది. కాగా గ్రూప్-2 రోస్టర్ తప్పులు సరిదిద్దిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో అభ్యర్థులు చేస్తున్న విన్నపాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పరీక్షను వాయిదా వేయాలని ఏపీ పీఎస్సి కి సూచించింది.