Friday 30th May 2025
12:07:03 PM
Home > తెలంగాణ > కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్

కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్

Actor Prakash Raj went to Yashoda Hospital for KCR

-బాత్రూంలో జారిపడిన కేసీఆర్… హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు
-యశోదా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
-యశోదా ఆసుపత్రిలో కేటీఆర్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్
-కేసీఆర్ కోలుకుంటున్నారని తెలుసుకుని హర్షం

ఇటీవల బాత్రూంలో జారిపడి హిప్ రీప్లేస్ మెంట్ శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ ను పలువురు ప్రముఖులు కలిసి పరామర్శిస్తున్నారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా నేడు సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రకాశ్ రాజ్ కలిశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్ ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారన్న విషయం తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అక్కడ కేసీఆర్ కుమార్తె కవిత, బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మధుసూదనాచారి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కూడా ఉన్నారు.

You may also like
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions