Ys Jagan On Badvel Incident | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లా బద్వేల్ ( Badvel ) సమీపంలో ఇంటర్ విద్యార్థిని పై ప్రోమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతిచెందింది.
తాజాగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) స్పందించారు. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని జగన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
అయితే ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉందని విమర్శించారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.
లా అండ్ ఆర్డర్ ( Law And Order )ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు ( Cm Chandrababu ) గారూ? అంటూ జగన్ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని నిలదీశారు.