Tuesday 22nd October 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఇదేమి రాజ్యం బాబు గారు..బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్

ఇదేమి రాజ్యం బాబు గారు..బద్వేల్ ఘటనపై వైఎస్ జగన్

Ys Jagan On Badvel Incident | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లా బద్వేల్ ( Badvel ) సమీపంలో ఇంటర్ విద్యార్థిని పై ప్రోమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతిచెందింది.

తాజాగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ ( Ys Jagan ) స్పందించారు. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమని జగన్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

అయితే ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యంకూడా ఉందని విమర్శించారు. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ధ్వజమెత్తారు.

లా అండ్‌ ఆర్డర్‌ ( Law And Order )ను కాపాడలేకపోతున్నారు.. ఇదేమి రాజ్యం చంద్రబాబు ( Cm Chandrababu ) గారూ? అంటూ జగన్ ప్రశ్నించారు. మహిళలకు, బాలికలకు రక్షణకూడా ఇవ్వలేకపోతున్నారు… ఇదేమి రాజ్యం? ప్రతిరోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని నిలదీశారు.

You may also like
‘ తాతా వచ్చాడే ‘..మనవరాలి పెళ్లిలో మాస్ స్టెప్పులేసిన మల్లారెడ్డి
అతిసారం బారినపడి మృతి చెందిన కుటుంబాలకు డిప్యూటీ సీఎం భరోసా!
మంచి మనసు చాటుకున్న మంచు లక్ష్మి..ప్రభుత్వ పాఠశాలలకు అండగా
నాగ చైతన్య శోభితా పెళ్లి పనులు షురూ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions