Tuesday 16th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > బద్వేల్ ఘటన కేసులో నిందితుడికి మరణశిక్ష పడాలి

బద్వేల్ ఘటన కేసులో నిందితుడికి మరణశిక్ష పడాలి

Cm Chandrababu On Badvel Incident | వైఎస్సార్ కడప ( YSR Kadapa ) జిల్లాలోని బద్వేల్ ( Badvel ) సమీపంలో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. శనివారం విద్యార్థిని పై ప్రేమోన్మాది విగ్నేష్ పెట్రోల్ ( Petrol ) పోసి నిప్పంటించిన విషయం తెల్సిందే. కాగా విద్యార్థిని మృతిచెందడం పట్ల సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సిఎంకు వివరించారు.

వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సిఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే….హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సిఎం అన్నారు.

ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions