Nagababu On Pawan’s Prayaschittha Deeksha | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Deputy Cm Pawan Kalyan ) ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. గత వైసీపీ ( YCP ) హయాంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వును వినియోగించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీవారి ప్రసాదం పట్ల ఘోరమైన తప్పు జరిగిందని, స్వామివారు భక్తులను క్షమించాలని కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేయనున్నట్లు పవన్ ప్రకటించారు.
ఈ క్రమంలో జనసేన పార్టీ ( Janasena Party ) ప్రధాన కార్యదర్శి నాగబాబు ( Nagababu ) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ జగన్ మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy )మరియు ఆయన వైసిపి ప్రభుత్వం చేసిన పాపాన్ని పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్తం చేసి కడిగేస్తున్నాడు ‘ అని ఆయన పేర్కొన్నారు.