Saturday 31st January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రేవంత్-చంద్రబాబు భేటీ..ఏపీకి షాకిచ్చిన తెలంగాణ

రేవంత్-చంద్రబాబు భేటీ..ఏపీకి షాకిచ్చిన తెలంగాణ

Telangana refuses to discuss ‘Banakacherla’ project at Revanth-Naidu meeting | ఢిల్లీ వేదికగా కేంద్రమంత్రి సమక్షంలో బుధవారం ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగనుంది.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పై చర్చగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భేటీ కావాల్సి ఉంది. సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ సింగిల్ అజెండా ఇచ్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని గుర్తుచేసింది.

ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను ఈ లేఖలో ప్రభుత్వం ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

You may also like
‘లేడికి-లేడి గెటప్ కు తేడా తెలీదా’..జగన్ కు కమెడియన్ కౌంటర్
పాడి కౌశిక్ పై ఎంఐఎం, ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం
ఖమ్మం మంత్రిపై వైఎస్ జగన్ కు ఫిర్యాదు
social media code for govt servants
వారు సోషల్ మీడియా వాడాలంటే అనుమతి తప్పనిసరి.. ఎక్కడంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions