Telangana Police Donated 11 Crores For CMRF | తెలంగాణ వరద బాధితుల ( Flood Victims )ను ఆదుకునేందుకు అందరూ ముందుకువస్తున్నారు. ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్ధం తెలంగాణ పోలీసులు ( Telangana Police ) భారీ విరాళం అందజేశారు.
పోలీసులు తమ ఒకరోజు జీతాన్ని మొత్తంగా రూ.11.06 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ ( Cm Revanth ) కు డీజీపీ జితేందర్ ( DGP Jithender ) రూ.11 కోట్ల చెక్కును అందజేశారు.
తెలంగాణ పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన సీఎంకు డీజీపీ ఈ మేరకు చెక్కును అందజేశారు. మరోవైపు తెలంగాణ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని రూ.130 కోట్లను వరద బాధితుల కోసం విరాళం అందించిన విషయం తెల్సిందే.