Raja Singh News| గోషామహల్ ( GoshaMahal ) బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ ( Raja Singh ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ( Warning ) ఇచ్చారు.
గోషామహల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ఈ మేరకు మాట్లాడుతూ 2018 లో తనను ఓడించడానికి ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని తెలిపారు.
సొంత పార్టీలో ఉండే కొందరు నేతలే ఇక్కడి సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇక్కడి వారు ఇతర పార్టీలకు కోవర్టులు ( Covert ) గా పని చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడి వారు ఇతరులకు సమాచారాన్ని ఇస్తే ఇతర పార్టీల వారు కూడా తనకు సమాచారాన్ని ఇస్తారని తెలిపారు రాజా సింగ్.
అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోవర్టుల అంతు చూస్తా అంటూ వ్యాఖ్యానించారు. తాను చవడానికైనా, చంపడానికైనా వెనుకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్.