Friday 18th October 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives President Visits Taj Mahal | మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ( Mohamed Muizzu ) ఆయన సతిమణితో కలిసి తాజ్ మహల్ ( Taj Mahal ) ను సందర్శించారు.

మంగళవారం ప్రత్యేక విమానంలో అగ్ర ( Agra ) చేరుకున్న ముయిజ్జుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రి యోగేంద్ర స్వాగతం పలికారు.

కాగా ముయిజ్జు తాజ్ మహల్ ను సందర్శించే సమయంలో సుమరు రెండుగంటల పాటు ప్రజలకు లోనికి వెళ్ళడానికి అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. సతీమణి తో కలిసి తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ ముయిజ్జు సందడి చేశారు.

నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోదీ ( Pm Modi )తో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మాల్దీవులకు 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. అనంతరం తమ దేశంలో పర్యటించాలని మోదీని మాల్దీవుల అధ్యక్షుడు కోరారు.

You may also like
ఆంజనేయ స్వామి ఆలయం ధ్వంసం..సీఎం చంద్రబాబు సీరియస్
పాకిస్తాన్ లో మార్నింగ్ వాక్ చేసిన కేంద్రమంత్రి జై శంకర్
జమ్మూ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం..హాజరైన రాహుల్ గాంధీ
అల్లు అర్జున్ పై కొండంత అభిమానం..సైకిల్ మీద UP to HYD

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions