Tuesday 17th June 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

తాజ్ మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు

Maldives President Visits Taj Mahal | మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ( Mohamed Muizzu ) ఆయన సతిమణితో కలిసి తాజ్ మహల్ ( Taj Mahal ) ను సందర్శించారు.

మంగళవారం ప్రత్యేక విమానంలో అగ్ర ( Agra ) చేరుకున్న ముయిజ్జుకు ఉత్తర్ ప్రదేశ్ మంత్రి యోగేంద్ర స్వాగతం పలికారు.

కాగా ముయిజ్జు తాజ్ మహల్ ను సందర్శించే సమయంలో సుమరు రెండుగంటల పాటు ప్రజలకు లోనికి వెళ్ళడానికి అనుమతి ఉండదని అధికారులు ప్రకటించారు. సతీమణి తో కలిసి తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ ముయిజ్జు సందడి చేశారు.

నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని మోదీ ( Pm Modi )తో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా మాల్దీవులకు 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. అనంతరం తమ దేశంలో పర్యటించాలని మోదీని మాల్దీవుల అధ్యక్షుడు కోరారు.

You may also like
car hangs mid air
Google Map ను నమ్మి ప్రయాణం.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ పైకి కారు!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions